27-05-2025 12:00:00 AM
లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
ఖమ్మం, మే 26 (విజయక్రాంతి): ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ కార్యాలయం లో డాకుమెంట్స్ రైటర్ పుచ్చాకాయల వెంకటేశ్వర రావు ద్వారా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కు రూ 30 వేలు లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్టార్ అరుణ ను ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ తెలిపిన వివరాల ప్రకారం గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్.
రూ 50 వేలు డిమాండ్ చేయగా, ప్రాధేయపడి ఎట్టకేలకు రూ 30 వేలకి అంగీకారం కుదుర్చుకొన్నారు. కార్యాలయంలో రూ 30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకొన్నారు. రైటర్ వెంకటేశ్వరరావు, సబ్ రిజిస్టర్ అరుణాలను ఏసీబీ కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.