6 March, 2026 | 12:20 PM

వినతిపత్రం అందజేత..

12-11-2025 05:10 PM

కుభీర్ (విజయక్రాంతి): ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా అర్హులను గుర్తించి ఈ పథకంలో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులతో కలిసి మాజీ సర్పంచ్ పండిత్ జాధవ్ మండల వ్యవసాయ అధికారి(AO) సారికని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ రైతుల సమస్యలను వివరించి, అర్హులైన ప్రతి రైతుకీ పథక ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. అధికారులు దీనిపై సానుకూలంగా స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.