calender_icon.png 24 June, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్కి గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

24-06-2025 01:09:48 AM

బాన్సువాడ, జూన్ 23 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో గిరిజన బాలికల గురుకుల పాఠశాల ను సోమవారం రాష్ట్ర వ్యవసాయ ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగ పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాట్లను విద్యార్థినిలతో ఆయన అడిగి తెలుసుకున్నారు . 

మెనూ ప్రకారం భోజనం, చేస్తే విద్యాబోధన  విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే రెండు రోజుల క్రితం రాత్రి విధి నిర్వహణలో పాఠశాల ఆవరణ లో మృతి చెందిన ఉపాధ్యాయురాలు మామిడి స్వప్న మృతికి సంతాపంగా రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.