అడవి పందుల దాడిలో చెరుకు తోట ధ్వంసం
20-07-2026 12:00 AM
తాడ్వాయి, జూలై, 19( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో శనివారం రాత్రి అడవి పందులు దాడిలో చెరుకు తోట ధ్వంసం అయినట్లు గ్రామస్తులు తెలిపారు.గ్రామానికి చెందిన షేర్బద్దం చంద్రారెడ్డి కి చెందిన చెరుకు తోటను పందులు దాడి చేసి నష్టపరిచాయి. ఈ ధ్వంసంలో రూ. 20 వేల వాసన జరిగినట్లు వారు తెలిపారు. అసలే వర్షాలు కురవక ఇబ్బందులు పడుతున్న రైతులకు అడవి పందుల దాడి మరో ఇబ్బందిగా మారిందని రైతులు వాపోతున్నారు






