29-05-2025 06:59:47 PM
సిపిఐ(ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు..
ఇల్లెందు టౌన్ (విజయక్రాంతి): సమస్యలకు పరిష్కారం ఆత్మహత్యలు కాదని బ్రతికి ఉండి సాధించుకోవాలని సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు(New Democracy State Secretariat Member Avunuri Madhu), ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఇల్లెందు మండల పరిధిలోని ఏడిప్పలగూడెంలో ఇటీవల మరణించిన ఏఎన్ఎం చింత సావిత్రి సంతాప సభలో వారు పాల్గొని మాట్లాడారు. అనేక ప్రజా సమస్యలను సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ పరిష్కరించిందని అన్నారు.
చింత సావిత్రికి జోహార్లర్పిస్తూ సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు సానుభూతిని తెలిపారు. సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ మండల నాయకులు చింత నరసింహ రావు అధ్యక్షతన జరిగిన ఈ సంతాపసభలో సిపిఐ (ఏం-ఎల్)న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణి, ఆల్ ఇండియా ట్రైబల్ ఫారం రాష్ట్ర కన్వీనర్ సూర్ణపాక నాగేశ్వరరావు, మర్రిగూడెం మాజీ సర్పంచ్ చింత రజిత,న్యూడెమోక్రసీ మండల నాయకులు పూణెం కోటయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు.