29-05-2025 06:31:58 PM
బైంసా (విజయక్రాంతి): వ్యాపారులు రైతులకు అసలైన విత్తనాలు, ఎరువులు ప్రభుత్వ నిబంధన మేరకు విక్రయించాలని టాస్క్ఫోర్స్ బృందం అధికారులు(Task Force Team Officers) పేర్కొన్నారు. గాంధీగంజులో గురువారం టాస్క్ఫోర్స్ అధికారుల బృందం స్థానిక పోలీసుల బందోబస్తుతో విత్తన, రసాయన ఎరువుల విక్రయ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణంలో విత్తనాలు, ఎరువుల విలువలు, సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. కొనుగోలు చేసిన రైతులకు విధిగా పూర్తిస్థాయి వివరాలతో బిల్లులను అందజేయాలన్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు ఎరువులు ఇంకా ఇస్తే స్థానిక వ్యవసాయ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.