సనత్నగర్లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం
29-04-2026 09:36 PM
సనత్నగర్,(విజయక్రాంతి): సనత్నగర్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో సమ్మర్ క్రికెట్ క్యాంప్ నేడు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా విద్యార్థులు విజయ్ ప్లే గ్రౌండ్ నుంచి మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తూ క్యాంప్ ప్రాంగణానికి చేరుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ హాజరై ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పిల్లలు క్రీడల్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతాయని పేర్కొన్నారు.క్యాంప్లో కోచ్ రాజ్ కిరణ్ ఆధ్వర్యంలో క్రికెట్ శిక్షణ అందించనున్నారు. ప్రాథమిక నైపుణ్యాల నుంచి ప్రొఫెషనల్ స్థాయి వరకు శిక్షణ ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి తల్లిదండ్రులు, స్థానికులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.






