calender_icon.png 16 June, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ముగిసిన సమ్మర్ క్రికెట్ ట్రోఫీ

16-06-2025 12:00:00 AM

కామారెడ్డి,జూన్ 15 (విజయక్రాంతి): వేసవి సందర్బంగా కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ ట్రోఫీ ఆదివారంతో ముగిసినట్లు నిర్వాహకులు తెలిపారు.టోర్నమెంట్ విజేతగా దొల్లు చరణ్ జట్టు,రన్నర్ గా అజయ్ బెల్లాయి జట్టు నిలిచాయి.ఈ టోర్నమెంట్ స్పాన్సర్ గా వ్యవహరించిన గాంధారి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు తూర్పు రాజులు కు నిర్వాహకులు,ఆటగాళ్లు ప్రత్యేక ధన్యవాదములు తెలిపి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తూర్పు రాజులు ,స్థానిక ఎస్త్స్ర అంజనేయులు  గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సురేష్ శిర్వి ,ఏఎంసి వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్ ,గాండ్ల లక్ష్మణ్ ,ఎస్కే హైమద్,గంగి రామకృష్ణ,గంగి సంతు,నితిన్ సిందే గురుకుల వైస్ ప్రిన్సిపాల్ ప్రవీణ్ ,పీఈటీ  తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేసారు.

టోర్నీ ఆర్గనైజర్లు టీవీ రాజు,తూర్పు సందీప్,దత్తాద్రి గౌడ్,కళ్యాణ్ జాదవ్,వీబీ రమేష్,భీమ్ మంచిప్ప,లైన్ ప్రశాంత్,కామెల్లి రాకేష్, అన్ని జట్ల ఆటగాళ్లు పాల్గొన్నారు. టోర్నీ ఉత్తమ ఆటగాళ్లుగా దొల్లు ప్రదీప్,ఎస్త్స్ర ఆంజనేయులు,హారాలే సౌరభ్ నిలిచారు.