calender_icon.png 16 June, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులసంఘాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం

16-06-2025 12:00:00 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్ చెరు/రామచంద్రాపురం, జూన్ 15: కుల సంఘాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం తెల్లాపూర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మరనాత చర్చికి 80 గజాలు, నాయి బ్రాహ్మణ సంఘానికి కొమరం భీమ్ కాలనీలో 150 గజాల స్థలాలను కేటాయిస్తూ ఆయా కుల సంఘాల అధ్యక్షులకు ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోమిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, వెలిమెల పీఏసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, ప్రభుత్వ ప్లీడర్ ప్రభు, రాగం దేవేందర్ యాదవ్, లచ్చిరామ్ నాయక్, బాబ్జి, శ్రీశైలం, నాగరాజు, శ్రీకాంత్, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత..

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.  తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం గ్రామంలోని మహిధర  లగ్జూరియా కాలనీలో నిర్వహించిన వెంకటేశ్వర స్వామి దేవాలయ భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజర య్యారు.

అనంతరం కాలనీలో నూతనంగా నిర్మించిన క్లబ్ హౌస్ ను ప్రారంభించారు. కాలనీలో మంచినీరు అందిస్తానని, డంపింగ్ యార్డ్ తరలించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహీధర ప్రాజెకట్స్ సీఎండి ప్రశాంత్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ జగన్, మాజీ ఎంపీటీసీ బిక్షపతి, ముత్తంగి పీఏసీఎస్ అధ్యక్షులు బిక్షపతి, ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు స్వాతి రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు.