16-06-2025 12:00:00 AM
ఎల్లారెడ్డి, జూన్ 15, (విజయక్రాంతి): అందరూ బాగున్నారా అంటూ ఆత్మీయంగా పూర్వ విద్యార్థులు 42 సంవత్సరాల తర్వాత ఒక వేదికపై కలిసి ఒకరిని ఒకరు ఆప్యాయంగా హత్తుకొని సంబరపడ్డారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1983. 84వ సంవత్సరంలో పదవ తరగతి విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో అందరూ కలిసి తమ మనోభావాలను చిన్ననాటి గుర్తులను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ సంబరపడ్డారు.
42 సంవత్సరాల క్రితం ఒకే తరగతి గదిలో విద్యను విభజించిన నేటి పూర్వ విద్యార్థులు నాటి రోజులకు నేటి రోజులకు ఎంతో మార్పు వచ్చిందని, మరియు పూర్వ విద్యార్థులు ఒకరి ఒకరు తమ పిల్లలు తమ భవిష్యత్తు గురించి చర్చించుకున్నారు