ప్రత్యర్థి శత్రువు కాదు
28-05-2024 12:05 AM
సుప్రీంకోర్టు
బీజేపీ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ, మే 27: ప్రత్యర్థి శత్రువు కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనల ప్రచురణపై కోల్కతా హైకోర్టు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ జీకే మహేశ్వరి, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. ప్రత్యర్థులను శత్రువులుగా భావించవద్దని హితవు పలికింది. బీజేపీ ప్రకటనలు తాము చూశామని, అవి అభ్యంతరకరంగా ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది.






