రెండు వేల మంది సజీవ సమాధి
28-05-2024 12:05 AM
న్యూఢిల్లీ, మే 27: పపువా న్యూగినియాలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది మందట వందమంది వరకు మరణించి ఉంటారని భావించగా, తాజాగా ఆ సంఖ్య రెండు వేలకు పెరిగింది. పపువా న్యూగినియా ప్రభుత్వం ఈ ప్రమాదంపై ఐక్యరాజ్యసమితికి వివరాలు వెల్లడించింది. మట్టికింద రెండువేల మంది వరకు సజీవ సమాధి అయి ఉంటారని తెలిపింది. ‘కొండచరియల కింద 2000 మందికిపైగా సజీవ సమాధి అయ్యారు. భవనాలు, పంటపొలాలన్నీ ధ్వంసమయ్యాయి. దేశ ఆర్థిక ప్రాణాధారానికి ఇది పెద్ద దెబ్బ’ అని పపువా న్యూగినియా అధికారులు ఐరాసకు తెలిపారు.






