20-06-2025 12:00:00 AM
ఈ తీర్పుద్వారా సుప్రీంకోర్టు పత్రికా స్వేచ్ఛను రక్షించిన సంఘటనగా, ఈ వ్యవహారాన్ని గుర్తుంచుకుంటుంది. రాజకీయ ప్రభావం ద్వారా పోలీసు అధికారులు వ్యవహరించరాదని, న్యాయవ్యవస్థ మన స్వేచ్ఛను నిలబెట్టిందని అనుకోవలసిందే.
సాక్షి టీవీలో చర్చ షోతో మొదలై, విమర్శల వ్యాఖ్యల దాడి, జిల్లా కోర్టులో న్యాయాధికార ఉత్తర్వుతో 14 రోజుల బందీ తరువాత, అక్కడి నుంచి మన అత్యున్నత న్యాయస్థానం వర కూ: ఓ జర్నలిస్టు స్వేచ్ఛకు సాగిన పోరా టం ఇది. మొత్తానికి పాత్రికేయుడికి సు ప్రీంకోర్టు ఆదేశాలతో న్యాయం లభించింది.
కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు 6వ తేదీన అరెస్టు చేసా రు. 14 రోజుల బంది విధించినా సుప్రీంకోర్టు 13న స్వేచ్ఛ ఇచ్చింది. పోలీసులు, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడి, తదితర ప్రముఖుల ప్రకటనల యుద్ధం తరువాత, న్యాయ పోరాటంతో, ప్రజాస్వామిక పాత్రికేయ విజయం సాధ్యమైంది.
సాక్షి టీవీ వేదికపై ప్రసారమైన చర్చా కార్యక్రమంతో మొదలైన గొడవ. వ్యాఖ్యాతగా పాల్గొన్న జర్నలిస్టు కొమ్మినేని శ్రీని వాస్రావును అరెస్టు చేసి పోలీసులు కేసు నమోదు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రం గా మందలించింది. జర్నలిస్టు హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛపై గౌరవంతో శరవేగంగా సుప్రీంకోర్టు స్పందించింది. ఈ అరెస్ట్ రాజ్యాంగ పరమైన హక్కుల ఉల్లంఘన అని న్యాయమూర్తుల ధర్మాసనం విమర్శించింది.
ఈ వ్యాఖ్యల్ని స్వయంగా జర్నలిస్టు (పిటిషన్) అనలేదు. “జర్నలిస్టు హక్కులు కాపాడి స్వేచ్ఛను రక్షించే అవసరం ఉందని ట్రయల్ కోర్టు విధించే షర తులతో కూడిన విడుదల చేయాలని ఆదేశిస్తున్నాం” అని ప్రకటించింది. అయితే, షరతులో ప్రధానమైందేమంటే భవిష్యత్తులో స్వయంగా లేదా ఇతరుల ద్వారా అవమానకర వ్యాఖ్యలు చేయకూడదని, శ్రీనివాసరావు నిర్వాహకుడిగా ఉన్న తన టివి షోలో ఉపేక్షించరాదని కూడా ధర్మాసనం స్పష్టంగా పేర్కొంది.
ముఖ్యమంత్రికి హెచ్చరిక:
“మహిళల మనోభావాలను దెబ్బ తీసే వ్యాఖ్యలు పరమ బాధ్యత లేని చర్య” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై విమర్శించా రు. అమరావతి రాజధాని మీద కుట్రలని తీవ్రంగా స్పందించారు. ఒకానొక విశ్లేషణ పేరిట ఇటువంటి అసభ్య వ్యాఖ్యలు చేయ డం సహించబోమని, క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
అయితే, ఈ మాట సుప్రీంకోర్టులో ప్రస్తావన జరగలే దు. కాని, ఇటువంటి బెదిరింపుల వల్ల పోలీసులు పాత్రికేయుడిని అరెస్టు చేసేందుకు ధైర్యం చేసేట్టు జరిగిందని కనిపిస్తుంది.
ఈ సుప్రీంకోర్టు కేసులో న్యాయవాదుల హాస్యంతో కూడిన వాదనలు వినవ లసిందే. న్యాయవాది సిద్ధార్థ్ దావే పాత్రికేయుని పక్షాన వాదిస్తూ, “ఈ జర్నలిస్టు (పిటిషనర్) ఈ మాటలు అనలేదు. ప్యానె ల్లో పాల్గొన్న మరొక వ్యక్తి చేసిన మాట అది. కేవలం కొమ్మినేని చేసిన తప్పు ఏ మంటే నవ్వడం, అవునన్నట్టు అనిపించే విధంగా ఉంది” అన్నారు.
సుప్రీంకోర్టు వాదనల్లో జస్టిస్ మిశ్రా “ఇది నవికా (టైమ్స్ నౌ) గానీ, సర్దేశాయ్ (రాజ్దీప్) గానీ చేసిన షోలలా ఉంది” అని వ్యాఖ్యానించారు. దానికి ప్రతిస్పందించిన లాయర్ దావే: “ఖచ్చితంగా సర్!” అన్నారు. జస్టిస్ మన్మోహన్ ప్రస్తావిస్తున్న మాట ఏమంటే “షోలో ఎవరో అన్నమాట ఆధారంగా సాక్షి షోజర్నలిస్టును ఎలా అరెస్ట్ చేస్తారు?”
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫున న్యాయవాది ముఖుల్ రోహత్గీ ఈ విధంగా అన్నా రు “ఆ వ్యాఖ్యలు అసభ్యంగా ఉన్నాయి. జర్నలిస్టు నవ్వడం ద్వారా ప్రోత్సహించాడని మేము అనుకుంటున్నాం.”
జస్టిస్ మన్మోహన్ హాస్యంగా స్పంది స్తూ “అయ్యో, ఎవరో తీవ్రమైన వ్యాఖ్య చేస్తే, మనం నవ్వుతాం. కాని కుట్ర చేయ డం అనలేం కదా!” అన్నారు. జస్టిస్ మిశ్రా కూడా వ్యంగ్యంగా అంటూ “ఇలాంటి కామెంట్లు ప్రతి రోజూ జరుగుతూనే ఉంటాయి!” అన్నారు. అప్పుడు న్యాయవాది రోహత్గీ “ఇతను నిస్సహాయంగా చూస్తున్న వ్యక్తి కాదు. అదే చానెల్లో భాగమయ్యే వ్యక్తి తెలుసా” అన్నారు.
ఆ దశలో జస్టిస్ మిశ్రా కొంచెం ఘాటు గా “కానీ ఆయనే ఆ వ్యాఖ్య చెయ్యలేదు కదా?” అన్నారు. దానికి బదులు న్యాయవాది రోహత్గీ “అతను ప్రేరేపించడమే చేస్తాడు. ఇది వేశ్యల రాజధాని అనేటట్లు అనుమతిస్తున్నాడు!” అనుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మరో ప్రసిద్ధ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా “ఇది కేవలం పరువు నష్టం కాదు. రాష్ట్రాన్ని అత్యాచార రాజధానిగా చూపే ప్రయత్నం” అని అన్నారు. అప్పుడు, ప్రభుత్వం పక్షాన హైకోర్టుకు వెళ్లాలని సూచించారు. దానికి సుప్రీంకోర్టు “మీడియా స్వేచ్ఛ కాపాడే బాధ్యత ఉందని” అంటూ వెంటనే విడుదలకు ఆదేశించింది.
న్యాయమూర్తులు మరో దశలో “పిటిషనర్ ఓ సీనియర్ జర్నలిస్టు. వయసు 70 ఏళ్లు. ఆయన లైవ్ విత్ కేసీఆర్’ అనే షోలో వ్యాఖ్యాతగా ఉన్న సమయంలో ఓ ప్యానెలిస్టు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఆయన నవ్వినప్పటికీ స్వయంగా వ్యాఖ్యలు చేయలేదు. ఈ విధంగా జర్నలిస్టుగా ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉంది. క
నుక, పిటిషనర్ను విడుదల చేయాలని నిర్ణయిస్తున్నాం. అయితే, భవిష్యత్తులో అవమానకర వ్యాఖ్యలు చేయకుండా లేదా అనుమతించకుండా ఉండాలని హెచ్చరిస్తున్నాం” అన్నారు. (‘లైవ్ లా’ వెబ్ సైట్ , కేసు సంఖ్య: డబ్లు.పి.(సిఆర్ఎల్) నెం. 244/2025లో వివరాలు చదువవచ్చు.)
ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి స్పందన:
వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్రెడ్డి స్పందిస్తూ, “ఈ అరెస్టు చట్ట విరుద్ధమైంది. ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి తలకిందులైన దాడి” అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
ఈ తీర్పుద్వారా సుప్రీంకోర్టు పత్రికా స్వేచ్ఛను రక్షించిన సంఘటనగా, ఈ వ్యవహారాన్ని గుర్తుంచుకుంటుంది. రాజకీయ ప్రభావం ద్వారా పోలీసు అధికారులు వ్యవహరించరాదని, న్యాయవ్యవస్థ మన స్వేచ్ఛను నిలబెట్టిందని అనుకోవలసిందే.
ఈ సంఘటన ఒక కేసుగా మారక పోయినా, పూర్తిగా ముగియక పోయినా కూడా, జర్నలిస్టుకు స్వేచ్ఛ లభించడం మాత్రం పాత్రికేయ రంగంలో సాధారణ ప్రజలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే పరిస్థితిని తెచ్చింది.