16 March, 2026 | 2:58 PM

Breaking News

అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •   ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి   •  

హుజూరాబాద్ లో స్వచ్చభారత్ కార్యక్రమం

18-09-2025 04:52 PM

హుజూరాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. సేవాపక్షం అభియాన్ కార్యక్రమంలో భాగంగా కార్యాలయ ఆవరణను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ 2014 అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. స్వయంగా ఆచరించి దేశ ప్రజలు సైతం పాటించేలా కృషిచేశారని అన్నారు. , ప్రజలంతా పరిసర ప్రాంతాలను స్వచ్ఛతగా  ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రభాకర్, తిప్పబత్తిని రాజు, రావుల వేణు, శ్రీనివాస్, గంగిశెట్టి రాజు, వడ్నాల చంద్రిక, రాజశేఖర్, సంజీవరెడ్డి, శశిధర్, సబ్బని రమేష్ కొలిపాక వెంకటేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.