19-09-2025 12:09:43 AM
ఇటిక్యాల, సెప్టెంబర్ 18:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని ఎర్రవల్లి మండలం బిజెపి మండల అధ్యక్షులు జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీచుపల్లి లో స్థానిక నాయకులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కోశాధికారి రాముడు మండల మండల అధ్యక్షులు బిసన్న మండల కార్యదర్శి నర్సింలు పోలింగ్ బూత్ అధ్యక్షులు మోహన్ గౌడ్ తిలక్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.