27 July, 2026 | 6:07 PM

Breaking News

ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •  

సింబియాసిస్ యూనివర్సిటీలో ఢిల్లీ విద్యార్థి మృతి

11-03-2025 11:57 AM

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మొదల్లగూడలో ఉన్న అంతర్జాతీయ సింబియాసిస్ విశ్వవిద్యాలయం(of International Symbiosis University)లో మూడవ సంవత్సరం చదువుతున్న లా కళాశాల విద్యార్థి షాగ్నిక్ బాసు(22) మృతి చెందాడు. సోమవారం రాత్రి సమయంలో బాత్రూంకి వెళ్ళిన విద్యార్థి ఎంతకీ బయటికి రాకపోవడంతో తోటి విద్యార్థులు వెంటిలేటర్ లోంచి గమనించగా కిందపడి ఉన్నాడు. వెంటనే కళాశాల సిబ్బందికి సమాచారం అందించారు. తలుపులు పగులగొట్టి బయటకు తీసి, చికిత్స నిమిత్తం శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరిస్తే.. అక్కడి నుంచి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు.