6 July, 2026 | 12:07 PM

ఎఫ్‌టీఎల్‌లో ఎస్‌వైఆర్ కన్వెన్షన్స్

31-08-2024 03:32 AM

మహేశ్వరం, ఆగస్టు 30: మీర్‌పేట్ పరిధిలో చెరువుల కబ్జాపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ నెల 28న చందన చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువులను సందర్శించారు. చెరువుల కబ్జా వివరాలు తెలుసుకున్నారు. వాటితోపాటూ పూర్తి నివేదికను వారం రోజుల్లో అందజేయాలని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా చందన చెరువు పక్కనే ఉన్న ఎస్‌వైఆర్ కన్వెన్షన్స్ సెంటర్‌ను రంగనాథ్ పరిశీలించారు. ఫంక్షన్‌హాల్ పార్కింగ్ స్థలంలో ఉన్న చెరువుకు సంబంధించిన ఎఫ్‌టీఎల్ దిమ్మెను గుర్తించారు. కన్వెన్షన్స్‌కు సంబంధించిన పత్రాలు సమర్పించాలని సూచించారు. కన్వెన్షన్స్ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించినట్లు తేలితే కూల్చివేయడం ఖాయమనే ప్రచారం జరుగుతున్నది.