27 June, 2026 | 7:29 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

04-04-2025 06:39 PM

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి, భిక్కనూర్, పాల్వంచ, దోమకొండ, బిబిపేట మండలాలలోని కళ్యాణ లక్ష్మి సిఎంఆర్ఎఫ్ షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఈ ఆర్థిక స్తోమత ఎంతో అండగా ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పల్వంచ మండల కేంద్రంలోని రైతు వేదికలో 13 మంది లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. మాచారెడ్డి మండల కేంద్రంలో ని రైతు వేదికల 46 మంది లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. రామారెడ్డి, కామారెడ్డి, బిక్కనూర్, రాజంపేట బిబిపేట్ దోమకొండ మండలాల్లోని ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు సీఎంఆర్ ఎఫ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ బిజెపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.