11-06-2025 12:17:38 AM
పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ జూన్ 10 (విజయ క్రాంతి) : మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణా సెంటర్లో గత మూడు నెలలుగా కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ మగ్గం ట్రేడ్ లలో ఉచిత నైపుణ్య శిక్షణ పొందిన రెండవ బ్యాచ్ అభ్యర్థులకు సెట్విన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్ష సెంటర్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు ఎ లాంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్ష సెంటర్ ఆవరణలో తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు పర్యవేక్షకులు గుండా మనోహర్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేంధర్, సెట్విన్ విజయ్ కుమార్, నిజ లింగప్ప, అనిల్ తదితరులు పాల్గొన్నారు.