21-06-2025 12:31:16 AM
ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం జూన్ 20 (విజయక్రాంతి) కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసి రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం చేకూర్చాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ్ సహాయం రఘురామిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం చుంచుపల్లి మండలంలోని నందాతండా, ధన్ బాద్, గౌత ంపూర్, రుద్రంపూర్, పెనగడప గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
మాజీ జెడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, పెదబాబు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ తదితర కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆ త్మీయ సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత తొమ్మిదిన్నర సం వత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో దగా పడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా మేనిఫెస్టోను రూపొందించడమే కాక వాటిని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నామన్నారు. వివిధ వర్గాలను, సంఘాలను, సంస్థలను వ్యక్తులను సంప్రదించి, వారి సమస్యలను విశ్లేషించి ఓ తేజోవంతమైన, సమగ్ర సుస్థిర తెలంగాణాను అభివృద్ధి పరచే విధంగా ముందుకు వెళుతున్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లోని ప్రతీ హామీని తప్పకుండా అమలుచేసి తెలంగాణ ప్రజల భవిష్యత్తును బంగారు బాటలో ముందుకు నడిపిస్తామని యావత్తు తెలంగాణ సమాజానికి హామీ ఇస్తున్నామన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో చుంచుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంతోటి పాల్, సుజాతనగర్ మండల అధ్యక్షు లు చింతలపూడి రాజశేఖర్, కాంగ్రెస్ నాయకుడు జేవిఎస్ చౌదరి,
రైల్వే బోర్డు సభ్యులు వై శ్రీనివాస్ రెడ్డి, టెలికాం బోర్డు సభ్యులు బోదాసు కనకరాజు, ఆర్టీఏ బోర్డు సభ్యులు బాదర్ల జోషి, ఐ ఎన్టియూసి వైస్ ప్రెసిడెంట్స్ ఎండి రజాక్, ఎస్ పితాంబరం, కాంగ్రెస్ నాయకులు బాల పాసి, తలుగు అనిల్, రావి రాంబాబు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ శ్రేణులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, కార్యకర్తలు మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.