calender_icon.png 21 June, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి పేదింటికి ప్రభుత్వ పథకం చేరుతుంది

21-06-2025 12:29:17 AM

  1. ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం

మండలంలో విస్తృత పర్యటన

పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం

పినపాక జూన్ 20(విజయ క్రాంతి) రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతూనే, ప్రతి పేదింటికి అభివృద్ధి, సంక్షేమాలను చేరవేస్తోందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప లు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. మండలంలోని జానంపేట, భూపతిరావుపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు శంఖుస్థాపన చేశారు.

జానంపేట ప్రభుత్వ పా ఠశాలను సందర్శించారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్ర భుత్వం సన్న బియ్యం అందిస్తుందని నాణ్యమైన, శుభ్రమైన భోజనం అందించాలని సూచించా రు. భవనాలు శిథిలావస్థకు చేరాయని, స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలపడంతో స్పందించిన ఎమ్మెల్యే నూతన భవనాల నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలని పంచాయతీరాజ్ డి.ఈ ని ఆదేశించారు.

అనంతరం జానంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పా యం మాట్లాడారు. లబ్ధిదారులు ఇంటి నిర్మాణం నాణ్యతగా, త్వరగా పూర్తి చేసుకోవాలని సూ చించారు. ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, రెండో విడత కార్యక్రమంలో మిగిలిన అర్హులందరికి ఇల్లు అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ప్రభుత్వంగా కాంగ్రెస్ పాలనను ప్రజలు గుర్తిస్తున్నారన్నారు.

పదేళ్లు అధికారంలో ఉండి దోచుకుతిన్న నేతలు నీతులు చెబుతున్నారన్నారు. ప్రభుత్వ పథకాలను పేదలకు చేర్చడంలో కాంగ్రెస్ నాయకులు భాద్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇంచార్జ్ తహసిల్దార్ జి గోపాలకృష్ణ, ఎం పీడీఓ సునీల్ కుమార్, ఎంపీవో వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం, మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ పూనేం ఉమా మహేశ్వరి, కాంగ్రెస్ నాయకులు కొర్స ఆనంద్, పేరం వెంకటేశ్వరరావు, జి వెంకటరెడ్డి, రాజేష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నూతన సీసీ రోడ్లు ప్రారంభోత్సవం.

జానంపేట గ్రామంలోని కొత్తగుంపు, భూపతి రావు పేట గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ల ను ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. భూపతిరావు పేట గ్రామం లో నెలకొన్న పలు సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యే పాయం దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకుపరిష్కరించాలని ఆదేశించారు.