21-06-2025 12:33:01 AM
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపాడు, జూన్20 (విజయక్రాంతి):పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం తాళ్లగొమ్మూరు ఫంక్షన్ హాల్ నందు మండలంలోని ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి వారికి వెన్నుదన్నుగా ప్రభుత్వం నిలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శిరీష,ఎంపీడీవో జమలారెడ్డి,ఎంపీఓ బాలయ్య,మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి,నాయకులు పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,కైపు శ్రీనివాస్ రెడ్డి,భజన సతీష్,మహమ్మద్ ఖాన్,భజన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.