28-06-2025 01:52:18 AM
కాగజ్నగర్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మహిళల ధర్నా
కాగజ్నగర్, జూలై 27(విజయక్రాంతి): గ్రామంలోని బెల్టుషాపులు గ్రామస్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, మందుబాబులు పూటుగా మద్యం తాగి ఇళ్ల మధ్య గొడవలకు దిగుతున్నారని శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం చింతగూడకు చెందిన మహిళలు రోడ్డెక్కారు. ‘మా గ్రామంలోని బెల్టు షాపులను తొలగించాలి’ అని నినాదాలు చేశారు.
అనంతరం కాగజ్నగర్ పట్టణంలోని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయానికి చేరుకుని నిరసన చేపట్టారు. అనంతరం ఎక్సై జ్శాఖ సీఐ రవికి వినతి పత్రం అందజేశా రు. దీనిపై సీఐ స్పందిస్తూ.. చింతగూడలో బెల్టుషాపులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అలాగే భట్టుపల్లి గ్రా మంలో నీటిఎద్దడికి పరిష్కారం చూపాలని గ్రామానికి చెందిన మహిళలు ఖాళీ బిందెలు చేబూని నిరసన చేపట్టారు. నిరసన గురించి తెలుసుకున్న అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. నీటిసమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.