29-05-2025 01:11:46 AM
యాదాద్రి భువనగిరి మే 28 ( విజయ క్రాంతి ) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండపైన దేవస్థాన ప్రసాద విక్రయశాల గోదాంలో దొంగలు పడ్డారు. గోదాం నుండి పది బస్తాల చింతపండు దొంగతనం చేస్తూ పట్టుబడ్డట్లు ఆలయ అధికారులు తెలిపారు.
దొంగతనానికి గురైన చింతపండు స్వాధీనం చేసుకుని నేరానికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగతనానికి కారకులైన సురక్ష ఉద్యోగులు పైన అందుకు సహకరించిన ఉద్యోగులపైన విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణ సెక్రటరీ నరహరి డిమాండ్ చేశారు.
గతంలో ఏనాడు దొంగతనాలు ఆలయంలో జరగలేదు కానీ ఈసారి జరగడం పట్ల పలు అనుమానాలు కలుగుతున్న నేపథ్యంలో విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని లేనట్లయితే ఈవో కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.
ఈవో ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఈఓ వెంకట్రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవపూజ అశోక్, ఆరె శ్రీధర్, ముక్యెర్ల సతీష్ యాదవ్, కోన్యాల నరసింహారెడ్డి, దండబోయిన వీరేశం, శారాజీ రాజేష్ యాదవ్ పాల్గొన్నారు.