29-05-2025 01:10:40 AM
దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ,మే 28 : ప్రతి ఒక్కరు సాయిబాబా ఆశీస్సులు పొందాలని నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం చింతపల్లి సాయిబాబా దేవాలయ వార్షికోత్సవ వేడుకలో వారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలమర్చుకోవాలని అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, దేవరకొండ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు టివియన్ రెడ్డి,పిఏ పల్లి మండల పార్టీ అధ్యక్షులు వల్లపు రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉజ్జిని విద్య సాగర్ రావు,ఎల్లంకి అశోక్, బాదేపల్లి నీరంజన్, వందనపు ఆంజనేయులు,ఆలయ కమిటి ఛైర్మన్ ధనుంజయ,తడకమల్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.