09-10-2025 12:00:00 AM
భద్రాచలం, అక్టోబర్ 8, (విజయక్రాంతి): జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు దీపావళి టపాసుల అక్రమ నిల్వలపై జిల్లా టాస్క్ఫోర్స్ , భద్రాచలం పోలీసులు సంయుక్తంగా బుధవారం నాడు దాడులను నిర్వహించారు. భద్రాచలం పట్టణంలోని భగవాన్ దాస్ కాలనీ, ఇండస్ట్రీయల్ ఏరియా,గ్యాస్ గౌడన్ ఏరియాలలో జనావాస ప్రాంతాలలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన నలుగురు వ్యక్తులపై భద్రాచలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
సుమారుగా రూ.10 లక్షల విలువగల దీపావళి టపాసులను స్వాదీనం చేసుకున్నారు. ఎవరైనా అనుమతులు లేకుండా, నియమ నిబంధనలను పాటించకుండా దీపావళి టపాసులను అక్రమంగా నిల్వ ఉంచితే కఠిన చర్యలు చెప్పు తీసుకుంటామని భద్రాచలం సీఐ నాగరాజు హెచ్చరించారు. ఈ విధంగా నివాస ప్రాంతాలలో ఉంచిన నిల్వల వలన గతంలో చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది.
ప్రజాహితార్థం ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఈ విధంగా టపాసులను బి వెంటనే డయల్ 100 నకు గానీ,స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందించాలని టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమాకాంత్ , సీఐ నాగరాజు కోరారు. ఈ దాడులలో టాస్క్ ఫోర్స్ సీఐ రమాకాంత్, ఎస్త్స్రలు ప్రవీణ్, రామారావు, సిబ్బంది పాల్గొన్నారు