10 June, 2026 | 7:53 PM

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: అటవీ శాఖ అధికారి ప్రియాంక

10-06-2026 06:31 PM

సిరికొండ,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి మొక్కలను నాటి సంరక్షించాలని అటవీ శాఖ అధికారి ప్రియాంక అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మండలంలోని రీమ్మ గ్రామపంచాయతీలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో చెట్ల పాత్ర కీలకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని పెంచాలని పిలుపునిచ్చారు.