15 June, 2026 | 7:19 PM

Breaking News

అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •  

టీ పొడి కల్తీ ముఠా అరెస్ట్

25-02-2026 12:30 AM

భారీ పరిమాణంలో స్వాధీనం

సనత్‌నగర్/బంజారాహిల్స్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): కమిషనర్ టాస్క్ ఫోర్స్ (వెస్ట్ జోన్) బృందం సనత్‌నగర్ పోలీసులతో కలిసి సనత్‌నగర్ ప్రాంతంలో దాడి నిర్వహించి టీ పొడిని కల్తీ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసింది. నిందితుడు జగన్నాథ్ బిష్ణో య్ (33), ఫతేనగర్‌కు చెందినవాడు. పోలీసుల విచారణలో నిందితుడు కోకోపీట్ (కొబ్బరి పీచు పొడి)ను శుద్ధి చేసి, వేడి బెల్లం నీటితో కలిపి ఎండబెట్టి, ‘సన్సెట్ ఎల్లో’, ‘టార్ట్రాజైన్’ వంటి సింథటిక్ రంగులు జోడించి నాసిరకం టీ డస్ట్, టీ గ్రాన్యూల్స్‌లో మిక్స్ చేసి కల్తీ టీ పొడిని తయారు చేస్తున్నట్లు బయటపడింది.

ఒక కిలో కల్తీ టీ తయారీలో 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్, 500 గ్రాముల గ్రాన్యూ ల్స్, 50 గ్రాముల రంగు కలిపిన కోకోపీట్ ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కల్తీ టీని అసలైన టీగా చూపించి స్థానిక టీ స్టాళ్లకు, డీలర్లకు విక్రయిస్తున్నాడు.

దాడిలో 120 కిలోల కల్తీ టీ పొడి, 30 కిలోల సహజ టీ పొడి, 138 కిలోల కోకోపీట్ మిశ్రమం, 1 వెయింగ్ మెషిన్, 800 గ్రాముల సన్సెట్ ఎల్లో, 700 గ్రాముల టార్ట్రాజైన్ రంగులు, గ్యాస్ సిలిండర్, బెల్లం బాక్సులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు నాణ్యమైన, గుర్తింపు పొందిన బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేయాలని, అనుమా నం ఉంటే వెంటనే అధికారులకు ఫిర్యా దు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.