13-06-2025 05:39:50 PM
మంథని,(విజయక్రాంతి): ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బాలికల పాఠశాల ప్రధానోపాధ్యయురాలు సుమలత(Manthani Government School HM Sumalatha) అన్నారు. శుక్రవారం అదే పాఠశాలలో పని చేస్తున్న దొంతుల కుమార్ ఉపాధ్యాయుడు కుమార్తె మనస్విని 8 వ తరగతిలో చేర్పించారు. ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ ఉపాధ్యక్షుడు కుమార్ మిగతా ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాల పై నమ్మకం పెంచేందుకు తన కుమార్తెను పాఠశాలల చేర్పించిన కుమారును ఆమె అభినందించారు.
విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయన్నారు. ఉచిత విద్యతో పాటు మధ్యాహ్న భోజనం.. పాఠ్య పుస్తకాలను అందిస్తామన్నారు. ప్రైవేట్ సంస్థల్లో వేలాది రూపాయలు వృధా చేసుకునే బదులు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పోచం, మధుకర్, శ్రీనివాస్, పీ డి కోమురోజు శ్రీనివాస్ పాల్గొన్నారు.