13-06-2025 05:34:40 PM
ఖానాపూర్(విజయ్క్రాంతి): బడి ఈడు పిల్లలను, బాల బాలికలను అంగన్వాడీ పాఠశాలలో చేర్పించాలని ఖానాపూర్ మున్సిపాలిటీ(Khanapur Municipality)లోని విద్యానగర్ 2 అంగన్వాడి కేంద్ర టీచర్ ఏ జ్యోతి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం విద్యానగర్ కాలనీలో అమ్మ మాట అంగన్వాడి బాట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి పిల్లలను అంగన్వాడి పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ఆయా ఏ లక్ష్మి, ఆశా వర్కర్ స్వాతి, తదితరులు ఉన్నారు.