calender_icon.png 17 November, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు రహిత సమాజం కోసం ఉపాధ్యాయుడి జనచైతన్యం

17-11-2025 01:03:29 AM

చివ్వెంల, నవంబర్ 16: చివ్వెంల మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్లో ఈరోజు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల ప్రమాదాలను తెలియజేస్తూ వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్దిరాల మండలం గోరంట్ల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచే స్తున్న సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని నడిపించారు.

యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలకు, రైతులకు, హమాలీలకు సందేశాలతో చైతన్యం కల్పించారు.సెలవు దినాలను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా జాతరలు, ఉత్సవాలు, వారాంత సంతలు, రద్దీ ప్రాంతాలలో నో డ్రగ్స్  సేవ్ లైఫ్ అనే నినాదంతో తన సేవలను అందిస్తున్న ప్రభాకర్, విచిత్ర వేషధారణలో మైకు పట్టుకుని, ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ,

కరపత్రాలు పంచుతూ ఐకెపి సెంటర్ అంతా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యువత లక్ష్యాలను ఏర్పరుచుకుని ప్రణాళికబద్ధంగా కష్టపడాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆయన పిలుపునిచ్చారు. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే సందేశంతో మత్తు రహిత సమాజ స్థాపన కోసం తన వంతు కృషి చేయాలని ప్రజలను కోరారు. ప్రభాకర్ నిర్వహించిన ఈ అవగాహన యాత్ర స్థానికుల ప్రశంసలను పొందింది.