26-06-2025 11:30:06 PM
జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్..
గద్వాల (విజయక్రాంతి): విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పిస్తూ, ఉత్తమ ఫలితాల కోసం ఉపాధ్యాయులు నిబద్ధతతో బోధన చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్(District Collector B.M. Santosh) అన్నారు. గురువారం మల్దకల్ మండలంలోని అమరవాయి గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతులు, ల్యాబ్, మెస్, పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు. వారికి బోధన సులభంగా అర్థమయ్యేలా స్పష్టంగా బోధించాలంటూ ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పూర్తి స్థాయిలో ఉండాలని తెలిపారు. పాఠశాల ఫలితాలు మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ అందరూ కలిసి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి సురేష్, ప్రిన్సిపాల్ నరేష్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.