3 May, 2026 | 2:04 PM

విమానంలో సాంకేతిక సమస్య

06-02-2025 01:45 AM

* చివరి నిమిషంలో ఎయిర్‌పోర్టు ప్రకటన 

* ఆందోళనకు దిగిన శ్రీవారి భక్తులు

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 5: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన అలయన్స్ ఎయిర్‌వేస్ విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. బుధవారం తెల్లవారుజామున 5.30 గం  శంషాబాద్ విమానాశ్ర యం నుంచి తిరుపతి వెళ్లాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని ఎయిర్‌పోర్టు అధికారులు ప్రయాణికులకు సమాచారం ఇచ్చారు.

అనం  ప్రయాణికులకు ఎలాంటి ఏ  చేయలేదు. నాలుగు గంటలపాటు ప్రయాణికులు వేచి చూశారు. తిరుమల వెళ్లాల్సిన వారిలో చాలామంది శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉండటంతో వారంతా ఆందోళనకు దిగినా ఎయిర్‌పోర్టు వర్గాలు ఏ  పట్టించుకోలేదు.