21-06-2025 01:42:05 AM
ఘట్ కేసర్, జూన్ 20 : టెక్నాలజీని దేశాభివృద్ధికి దోహదపడేలా వినియోగించాలని సుదీక్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి డాక్టర్ సుబ్రహ్మణ్యశర్మ అన్నారు. పోచారం మున్సిపల్ వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీలో అనురాగ్ యూనివర్సిటీ, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో అవెన్సిస్ 2కె25 కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు సుదీక్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి డాక్టర్ సుబ్రమణ్య శర్మ, ఐబీఎం ఎగ్జిక్యూటివ్ పార్ట్నర్ అనురాధ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు పరిమితులు దాటి ప్రయత్నించినప్పుడే విజయాలు సాధిస్తారని టెక్నాలజీని దేశాభివృద్ధికి దోహతపడేలా వినియోగించాలని సూచించారు. విద్యార్థికి మార్కులు సాధించడం కన్నా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నా దృష్టి ఉంటేనే విజయాలు సాధిస్తారని పేర్కొన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని తెలిపారు.
విశిష్ట అతిథి తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ డాక్టర్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ టెక్నాలజీని వినియోగించి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపినప్పుడే విద్యకు సార్థకత వస్తుందని సమకాలిన డిజిటల్ విప్లవంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తమకు తాము ఆధునీకరించుకున్నప్పుడే విద్యార్థులు విజయం సాధిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమానికి డీన్లు ప్రొఫెసర్ వి. విజయ్ కుమార్ ప్రొఫెసర్ జి. విష్ణుమూర్తి సిఎస్ఐ ప్రతినిధులు సుధాకర్, రాజు, రమణ, సమన్వయకర్తలు డాక్టర్ వి. రామకృష్ణ, అమితా మిశ్రా, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.