12 May, 2026 | 11:19 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలి యువకుడికి గాయాలు

20-07-2025 02:58 PM

బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (Improvised Explosive Device) పేలడంతో 16 ఏళ్ల బాలుడు గాయపడ్డాడని పోలీసులు ఆదివారం తెలిపారు. భోపాల్‌పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండపడ్గు గ్రామానికి చెందిన బాధితుడు శనివారం సాయంత్రం పశువులను మేపడానికి సమీపంలోని అడవిలోకి వెళ్లినప్పుడు ఈ పేలుడు సంభవించిందని తెలిపారు.బాలుడు అనుకోకుండా ఐఈడిని తాకాడంతో అది పేలి అతని కాళ్లకు గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు.

బాలుడిని బీజాపూర్ జిల్లా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అడవుల్లో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల సమయంలో ఈ మార్గాలను ఉపయోగించే భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడానికి మావోయిస్టులు తరచుగా మట్టి ట్రాక్‌లపై ఐఈడిలను అమర్చుతారని చెప్పారు. బస్తర్ ప్రాంతంలో గతంలో అల్ట్రాలు వేసిన ఇటువంటి ఉచ్చులకు పౌరులు బలైపోయారని పోలీసులు తెలిపారు.

అటవీ ప్రాంతాలను సందర్శించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద వస్తువులు లేదా కార్యకలాపాల గురించి వెంటనే పోలీస్ స్టేషన్, సమీపంలోని భద్రతా శిబిరానికి తెలియజేయాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూలై 13న బీజాపూర్‌లోని మద్దేడ్ ప్రాంతంలో జరిగిన ఇలాంటి సంఘటనలో ఒక మైనర్ బాలికతో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు బీజాపూర్‌తో సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు హింసలో దాదాపు 25 మంది ప్రాణాలు కోల్పోయారు.