18 July, 2026 | 8:36 PM

Breaking News

గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం   •   ఎల్ నినో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఎంఏఓ   •   మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి   •   ఎల్నినో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలి   •   బీఆర్ఎస్ కార్యకర్త తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే   •   పార్టీ కార్యకర్తలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వైఖరి!   •   కేసుల పరిష్కారానికి కృషి జరగాలి   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయండి   •  

నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలి యువకుడికి గాయాలు

20-07-2025 02:58 PM

బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (Improvised Explosive Device) పేలడంతో 16 ఏళ్ల బాలుడు గాయపడ్డాడని పోలీసులు ఆదివారం తెలిపారు. భోపాల్‌పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండపడ్గు గ్రామానికి చెందిన బాధితుడు శనివారం సాయంత్రం పశువులను మేపడానికి సమీపంలోని అడవిలోకి వెళ్లినప్పుడు ఈ పేలుడు సంభవించిందని తెలిపారు.బాలుడు అనుకోకుండా ఐఈడిని తాకాడంతో అది పేలి అతని కాళ్లకు గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు.

బాలుడిని బీజాపూర్ జిల్లా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అడవుల్లో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల సమయంలో ఈ మార్గాలను ఉపయోగించే భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడానికి మావోయిస్టులు తరచుగా మట్టి ట్రాక్‌లపై ఐఈడిలను అమర్చుతారని చెప్పారు. బస్తర్ ప్రాంతంలో గతంలో అల్ట్రాలు వేసిన ఇటువంటి ఉచ్చులకు పౌరులు బలైపోయారని పోలీసులు తెలిపారు.

అటవీ ప్రాంతాలను సందర్శించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద వస్తువులు లేదా కార్యకలాపాల గురించి వెంటనే పోలీస్ స్టేషన్, సమీపంలోని భద్రతా శిబిరానికి తెలియజేయాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూలై 13న బీజాపూర్‌లోని మద్దేడ్ ప్రాంతంలో జరిగిన ఇలాంటి సంఘటనలో ఒక మైనర్ బాలికతో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు బీజాపూర్‌తో సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు హింసలో దాదాపు 25 మంది ప్రాణాలు కోల్పోయారు.