calender_icon.png 6 June, 2025 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ

05-06-2025 09:08:22 AM

హైదరాబాద్‌: నేడు సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం(Telangana Cabinet meeting) జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి వర్గ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనుంది. ప్రధానంగా ఉద్యోగుల సమస్యలపై(Employees Problems) చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల డీఏలు, ఇతర సమస్యలపై నివేదికలోని అంశాలపై  చర్చించనున్నారు. ఉద్యోగల సమస్యల పరిష్కారంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. రాజీవ్ యువ వికాసంపై చర్చించి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీపై చర్చించే అవకాశం ఉంది. బనకచర్ల, కాళేశ్వరం ప్రాజెక్టులపై విజిలెన్స్, ఎన్ డీఎస్ఏ నివేదికలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. వానాకాలం పంటల సాగు సన్నద్దతపై క్యాబినెట్ లో చర్చించే అవకాశముంది.