calender_icon.png 6 June, 2025 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం

05-06-2025 08:53:13 AM

తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanam) భక్తుల రద్దీ కొనసాగుతోంది. 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి(Srivari Sarva Darshan) 16 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు గురువారం ప్రకటించారు. 78,288 మంది భక్తులు బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 32,079 మంది భక్తులు తలనీలాలు సమర్పించి ఏడుకొండలవాడికి మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. తిరుమల ఆలయంలో రద్దీని బట్టి, దర్శన సమయం మారవచ్చని అధికారులు తెలిపారు. టీటీడీ(TTD) వెబ్‌సైట్,  ఇతర సమాచార కేంద్రాల ద్వారా తాజా సమాచారం తెలుసుకోవడం మంచిదని సూచించారు.