05-06-2025 09:21:42 AM
హైదరాబాద్: జగిత్యాల జిల్లా(Jagtial District) కొండగట్టు వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. కొండగట్టు వద్ద పెళ్లి బృందం కారును(Wedding vehicle) వేగంగా దూసుకొచ్చిన డీసీఏం వ్యాను అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో రుద్ర(03) అక్కడికక్కడే మృతి చెందగా, వరుడు సహా ఆరు గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.
రాత్రి నాందేడ్ నుంచి హుజురాబాద్(Nanded to Huzurabad)కు పెళ్లి బృందం వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. రోడ్డు ప్రమాదంలో వరుడు గాయపడటంతో వివాహం ఆగిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో శుభకార్యం జరుగుతుండగా ఈ ప్రమాదం వారి కుటుంబంలో విషాదం నింపిందని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.