22-07-2024 03:03:45 PM
హైదరాబాద్: సచివాలయంలో 317 జీవోపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సోమవారం సమావేశమైంది. ఈ భేటీలో క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం లో వివిధ శాఖల ఉన్నతాధికారులు నవీన్ మిట్టల్, మహేష్ కుమార్ ఎక్కా దత్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు, అడిషనల్ డీజీ షికా గోయల్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన, ఇంటర్మీడియట్ బోర్డ్ డైరెక్టర్ శృతి ఓజా, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని, సోషల్ వెల్ఫేర్ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్, ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి, విద్యా శాఖ సంచాలకులు వెంకట నరసింహ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వినయ్ కృష్ణారెడ్డి, బూసని వెంకటేశ్వరరావు తదితర వివిధ శాఖల ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.