calender_icon.png 18 September, 2025 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

22-07-2024 02:35:27 PM

హైదరాబాద్: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్రమార్క‌, రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి దీప‌ దాస్ మున్షీ సోమావారం ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీని క‌లిశారు. వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు సీఎం రేవంత్ ప్రియాంకా గాంధీరి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రైతు రుణమాఫీ కార్యక్రమాలపై దృష్టి సారించిన వరంగల్ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేతలను ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఢిల్లీ వెళ్లారు. సీఎం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశం కానున్నారు. బహిరంగ సభ కోసం కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నుండి కూడా సమయం కోరే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వరంగల్‌లో రైతు రుణమాఫీని ప్రకటించినందున, దాని అమలును హైలైట్ చేయడానికి పార్టీ అక్కడ బహిరంగ సభ నిర్వహించడం సముచితమని ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకత్వానికి తెలియజేయాలనుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.