02-06-2025 03:20:31 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు(Telangana State Formation Celebrations) సోమవారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్(MLA Dr. Jatoth Ramachandru Naik) ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(Collector Advait Kumar Singh), అదనపు కలెక్టర్ బ్రహ్మచారి(Additional Collector Brahmachari), ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్(SP Sudhir Ramnath Kekan), ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే డిసిసి కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, తెలంగాణ ఆవిర్భావం సోనియా గాంధీతోనే సాధ్యమైందని, సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అనంతరం జిల్లా కేంద్రంలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, డివైసిసి అధ్యక్షుడు సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయంలో అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు తదితరులు పాల్గొన్నారు.