calender_icon.png 12 June, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిభకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ అవకాశాల గని

11-06-2025 12:53:50 AM

పెట్టుబడులకు శైవగ్రూప్, టారనిస్ కేపిటల్ సై

2,125 కోట్ల పెట్టుబడులు.. 5020 మందికి ఉపాధి

  1. రాష్ట్రానికి చెందిన ఐదు కంపెనీలతో ఒప్పందం 
  2. రాబోయే మూడేళ్లలో మరో రూ.24 వేల కోట్లు
  3. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృ త్వంలో  రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి, తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే ప్రజా ప్రభుత్వ నిర్ణయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. యూఏఈకి చెందిన ప్రముఖ కంపెనీలు శైవగ్రూప్, టారనిస్ కేపిటల్ సంస్థలు రాష్ట్రానికి చెందిన ఐదు సంస్థలతో మంగళవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నాయి.

ఈ రెండు కంపెనీలు రాష్ట్రంలో రూ. 2,125 కోట్ల పెట్టుడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నాయని, దీని వల్ల 5,020 మందికి ఉపాధి లభించనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో మరో గొప్ప అడుగు వేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ప్రజా ప్రభు త్వం ఏర్పడిన 18 నెలల్లో 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, ఏడాదిన్నర కాలంలో రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చామని, ప్రైవేట్ రంగాల్లో లక్ష మందికి పైగా తెలంగాణ యువతకు ఉద్యోగాలు లభించాయ ని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. 

‘శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ సంయుక్తంగా రివలేషన్స్ బయోటెక్‌లో రూ. 1360 కోట్లు. మనాకిన్ బయోలో రూ. 340 కోట్లు,  స్వబోధ  ఇన్ఫినిటీ ఇన్వెస్ట్ మెంట్స్ అడ్వైజర్స్‌లో రూ. 80 కోట్లు, ఎగ్జిగెంట్ డ్రిల్లింగ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 90 కోట్లు, యంత్రటెక్ కంట్రోల్స్‌లో రూ. 255 కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయని మంత్రి చెప్పారు.

ఈ  రెండు కంపెనీలతో ఒప్పందం ఇది తొలి అడుగు మాత్రమేనని, రాబోయే మూడేళ్లలో బయోటెక్, ఏఐ, డేటా సెంటర్, డిఫెన్స్, ఫిన్‌టెక్, పబ్లిక్ సెక్టార్స్ తదితర రంగాల్లో మరో రూ.24 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ సంసిద్ధత వ్యక్తం చేశాయని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

ఈ రెండు కంపెనీలు రాబోయే మూడేళ్లలో బయోటెక్ రంగం లో తినుబండారాల్లో చక్కెర శాతాన్ని తగ్గించడం, యాంటి డయాబెటిక్,పుడ్ మేనేజ్‌మెంట్ ప్రొడక్ట్స్ ప్రత్యేక దృష్టి సారించనున్నాయని మంత్రి వివరించా రు. పబ్లిక్‌సెక్టార్ విషయానికొస్తే ఫోర్త్‌సిటీ, ఏఐ సిటీలో పెట్టుబడులు పెట్టనున్నాయ ని చెప్పారు.

సీఎం రేవంత్‌రెడ్డి  నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై నమ్మకం ఉంచి తెలంగాణ రైజింగ్‌లో భాగస్యామయ్యేందుకు ముందుకొచ్చిన కంపెనీలకు మం త్రి  శ్రీధర్‌బాబు ధన్యవాదాలు తెలిపారు. 

తెలంగాణ గమ్యస్థానం.. 

తెలంగాణ ఒక రాష్ట్రం కాదని, అవకాశాల గని, ప్రతిభకు కేరాఫ్ అడ్రస్ అని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. కొత్త ఆలోచనలు, సృజనాత్మకత ఆవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం కేంద్ర బిందువన్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలకు తెలంగా ణ గమ్యస్థానమని మంత్రి పేర్కొన్నారు. ‘మీ ఎదుగుదలే.. మా రాష్ట్రాభివృద్ధి’ అని సీఎం రేవంత్‌రెడ్డి నమ్ముతారని, అందు కు ప్రజా ప్రభుత్వం అన్ని రకాలుగా అం డగా ఉంటుందన్నారు. అందుకే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందు కు రావాలని ఈ వేదిక ద్వారా మరోసారి ఆహ్వానం పలుకుతున్నామని మంత్రి వివరించారు. 

రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు వారికి కనిపించడం లేదా? 

రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని, పరిశ్రమలు తరలిపోతున్నాయని తమ ప్రభుత్వంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. తమ ప్రభుత్వం రాష్ట్రానికి తీసు కొస్తున్న పెట్టుబడులు వారికి కనిపించడం లేదా? అని ఆయన నిలదీశారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు ఒకసా రి ఆలోచించాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు.

తెలంగాణ యువత ప్రతిభే తమకున్న పెద్ద ఆస్తి అని, డిగ్రీ, ఇంజనీరింగ్ పట్టా తీసుకుని బయటికొచ్చే విద్యా ర్థుల్లో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ఉండటం లేదని పారిశ్రామిక వేత్తల నుంచి తరచు ఫిర్యాదుల వస్తున్నాయన్నారు. ఈ అంతరాన్ని తగ్గించేందుకే అఅంతర్జాతీయ ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ఏర్పా టు చేశామన్నారు.

అందరి భాగస్వామ్యం తో కోర్సులకు రూపకల్పన చేసి.. మీకు కావాల్సిన మానవ వనరులను రెడీమేడ్‌గా అందిస్తున్నామని, ఖర్చు, శ్రమను తగ్గిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాయ్‌డిన్ రోచ్, శైవ గ్రూప్ చైర్మన్, సీఈవో అమిత్ జగన్నాథ్ వర్మ, టారనిస్ కేపిటల్ సీఈవో నికోలస్ ఎస్.బింగ్ హామ్, రివలేషన్స్ బయోటెక్ ఎండీ రవిచంద్ర బీరం, మానకిన్ బయో డైరెక్టర్ జశ్వంత్ ప్రణవ్ యతిరాజాం.

స్వబోధ ఇన్ఫిటివ్ ఇన్వెస్ట్ మెంట్స్ అడ్వైజర్స్ సీఈవో సంకర్ష్ చందా, ఎగ్జిగెంట్ డ్రిల్లింగ్ టెక్నాలజీ ప్రైవేట్‌లిమిటెడ్ డైరెక్టర్ పాండురంగారావు తమ్మినేని, యంత్ర టెక్ కంట్రోల్స్ సీఈవో సమీర్‌కాంత్ తదితరులు పాల్గొన్నారు.