calender_icon.png 13 June, 2025 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

11-06-2025 12:54:13 AM

ఆర్డీవో కృష్ణవేణి 

మహబూబాబాద్, జూన్ 10 (విజయ క్రాంతి): భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి 2025 ఆర్‌ఓఆర్ చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్ ఆర్డిఓ కృష్ణవేణి కోరారు.

జిల్లావ్యాప్తంగా వివిధ గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడా మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న భూభారతి సదస్సులను ఆర్డిఓ సందర్శించారు. భూ సమస్యలు ఉన్న రైతులు తమ వివరాలతో కూడిన దరఖాస్తులను సదస్సులో అధికారులకు అందజేయాలని, దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలకు పరిష్కారం చూపుతారని చెప్పారు. ఈ సందర్భంగా దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను ఆర్డీవో పరిశీలించారు.