02-06-2025 02:16:21 PM
హైదరాబాద్: తెలంగాణ భవన్లో(Telangana Bhavan) ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు(Telangana State Formation Day) నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, కె.పి. వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు వాణీ దేవి, రవీందర్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, పార్టీ నేతలు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, పొన్నాల లక్ష్మయ్య, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ కార్యాలయ ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అమరవీరులను సత్కరిస్తూ కేసీఆర్ నాయకత్వాన్ని ప్రసంసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నాయకులు స్మారక కేక్ను కట్ చేయడంతో వాతావరణం దేశభక్తి నినాదాలు, డ్రమ్ బీట్లు, హర్షధ్వానాలతో నిండిపోయింది. జిల్లా, మండల, నియోజకవర్గ ప్రధాన కార్యాలయాల్లోని అన్ని పార్టీ కార్యాలయాల్లో ఇలాంటి పండుగ వాతావరణం నెలకొంది.