02-06-2025 05:48:01 PM
మందమర్రి (విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ(Telangana State Formation Day) వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం పట్టణంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సోత్కు సుదర్శన్, నాయకులు పైడిమల్ల నర్సింగ్ లు మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం 1400 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలను చూసి చలించి సోనియా గాంధీ ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటీకి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని వారు అన్నారు.
తెలంగాణ కోసం తొలిదశ ఉద్యమంలో పోరాటం చేసి తుపాకీ తూటా తాకినా లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన గొప్ప నాయకుడు కాక వెంకట స్వామి అని వారు స్పష్టం చేశారు. కాకా తనయులు చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముందు వరుసలో నిలిచారని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు నేరువట్ల శ్రీనివాస్, పట్టణ మహిళా అధ్యక్షురాలు గడ్డం రజిని, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుల్లూరు లక్ష్మణ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి జమీల్, పట్టణ ఉపాధ్యక్షులు కనకం రాజు, గుడ్ల రమేష్, సంగి సదానందం, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు ఎండి ఆఫీస్, పట్టణ ప్రధాన కార్యదర్శి బూడిద శంకర్ సేవాదల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా, పట్టణ సేవాదళ్ అధ్యక్షులు ఉదయ్, మంద తిరుమల్ రెడ్డి, కిరణ్ నర్సోజి మహంత్ అర్జున్ లు పాల్గొన్నారు.