21-07-2025 01:39:39 AM
మహబూబాబాద్, జూలై 20 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో ఇటీవల మరణించిన నిరుపేద, కారు డ్రైవర్ నబి కుటుంబానికి ఆ గ్రామానికి చెందిన ఎస్ ఎం హుస్సేన్ పదివేల రూపాయలను సహాయంగా అందజేశారు. అలాగే భవిష్యత్తులో ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వద్దిరాజు పెద్ద వెంకటేశ్వర్లు, గడ్డం శ్రీకాంత్, రహీం, జలీల్, సలీం, అమీర్ పాల్గొన్నారు.