బోడమంచతండాలో ఉద్రిక్తత
24-12-2025 12:48 PM
హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా( Mahabubabad district) కేసముద్రం మండలం బోడమంచ తండాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తండా వాసులు, పోలీసుల మధ్య జరిగిన తోపులాటలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. బోడమంచతండాలో నిన్న జరిగిన హత్యకు ప్రతీకారంగా స్థానికులు ఆందోళన చేపట్టారు. తండా వాసులు అనుమానితుడు ఆర్ఎంపీ డాక్టర్ బైక్, షాపు దగ్ధం చేశారు. మరో అనుమానితుడి ఇంటిని ధ్వంసం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తండా వాసులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బోడమంచతండాలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. తండా వాసి భూక్యా వీరన్న(45) నిన్న అనుమానాస్పదంగా మృతిచెందాడు.




