24-12-2025 12:37:31 PM
హైదరాబాద్: అంత రాష్ట్ర చిన్నారుల అక్రమ రవాణా ముఠాను(Child trafficking gang arrested) సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకువచ్చి హైదరాబాద్, మంచిర్యాలలో విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 20 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలో సృష్టి ఫెర్టిలిటీ కేసులో నిందితులు ఉన్నట్లు గుర్తించారు. సృష్టి కేసులో బెయిల్ పై వచ్చి చిన్నారులను విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. చిన్నారికి రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.