6 July, 2026 | 3:57 PM

Breaking News

విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •  

టీజీ క్యాబ్ 82వ పాలకవర్గ సమావేశం

28-03-2025 12:54 AM

హైదరాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో గురువారం తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ 82వ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెని రవీందర్‌రావు, వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య పాల్గొన్నారు. సమావేశంలో ఆర్థిక లావాదేవీలపై, టర్నోవర్స్, జిల్లాలోని డీసీసీబీల పనితీరు, పురోగతి, ఐటీ రంగం, నెట్‌వర్క్, డిపాజిట్స్ ఎడ్యుకేషనల్ అవర్నెస్, ఆర్బీఐ, నాబార్డ్ సర్క్యూలర్ల అమలు, వ్యవసాయ రుణాలు, రైతు రుణమాఫీపై  సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో టీజీక్యాబ్ ఎండీ గోపి, డైరెక్టర్లు కుంభం శ్రీనివాస్‌రెడ్డి, అడ్డి బోజారెడ్డి, మామిల్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, దొండపాటి వేంకటేశ్వర రావు, చిట్టీ దేవేందర్‌రెడ్డి, కుంట రమేష్‌రెడ్డి, ప్రొఫెషనల్ డైరెక్టర్లు శ్రీనివాసులు, మోహన్ ఐయర్, అడిషనల్ రిజిస్ట్రార్ శ్రీనివాస్, నాబార్డ్ సీజీఎం ఉదయ్ భాస్కర్ పాల్గొన్నారు.