ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్వీనర్ గాజుల పోతన్న ఆధ్వర్యంలో పర్యటించారు. మండలంలోని ఆదివాసి గిరిజన గ్రామాలైన మహదుగూడ కేశవ్ గూడ నాగు గూడ చింతల బోరి గ్రామాలలో పర్యటించి ఓటరు జాబితా సవరణపై పరిశీలించారు. ఆయా గ్రామాలలో 235 238 239 పోలింగ్ బూతుల యందు డెబ్బై శాతం కార్యక్రమం పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాల ప్రజలను మరింత చైతన్యం చేసినట్లయితే 100% పూర్తి అవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ఓటు ప్రాధాన్యతను గ్రామస్తులు వివరించారు. ఓటర్లను జాబితాలో చేరే విధంగా చూడాలని బిఎల్ఏలకు సూచించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కస్సరే పోతన చింతలపూడి మాజీ సర్పంచ్ రాందాస్ అమృత రావు పాటిల్ కార్ ఎడ్ల శ్రీనివాస్ ఉన్నారు.






